Homeఫ్లాష్ ఫ్లాష్గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తెస్త‌రేమో.. మంత్రి కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తెస్త‌రేమో.. మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ః గ్రేటర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది.

టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు.

టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఎంఐఎం తరపున అన్నాదమ్ముళ్లు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ మాత్రం స్థానిక నేతలతో పాటు ఢిల్లీ నుంచి కూడా లీడర్లను రప్పిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య నగరంలో పర్యటించారు.

త్వరలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ కూడా స్టార్ క్యాంపెయినర్లతోపాటు సీనియ‌ర్ నేత‌లు రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ అగ్ర నేతల ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ANI వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. గల్లీ ఎన్నికల్లోనూ మత సంబంధ విషయాలనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ నుంచి నేతలను రప్పిస్తున్న బీజేపీ.. అవసరమైతే డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తీసుకొస్తుందేమోనని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

స్థానిక అంశాల గురించి బీజేపీ నేత‌లు మాట్లాడ‌రు. పాతం కాలం నాటి విషయాలు, మత సంబంధ అంశాలు, మత విద్వేషాలే వారు మాట్లాడుతారని కేటీఆర్ అన్నారు.

ఢిల్లీ నుంచి లీడర్లు వస్తున్నారు. అంతర్జాతీయ నేతలు కూడా రావొచ్చు. డొనాల్డ్ ట్రంప్ బీజేపీకి మిత్రుడయినందున ఇక ఆయన కూడా ప్ర‌చారానికి వస్తాడేమో.. అని కేటీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img