– ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
– అభివృద్ధి పనులపై సమీక్ష
ఇదేనిజం, గద్వాల : అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించొద్దని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.