Homeజిల్లా వార్తలువెల్గటూర్​లో ఇంటింటికి అక్షింతలు పంపిణీ

వెల్గటూర్​లో ఇంటింటికి అక్షింతలు పంపిణీ

ఇదేనిజం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలం కప్పారావుపేట గ్రామంలో అయోధ్య రామయ్య అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామభక్త సభ్యులు ఊరేగింపుగా వెళ్లారు. 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అక్షింతలను పూజ మందిరంలో ఉంచుకొని, ప్రతి కుటుంబ సభ్యులపై అక్షింతలను రాముని దీవెనగా భావించి జల్లుకోవాలని అర్చకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉపేందర్ శర్మ, వర్ధన్, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి సత్యం, ఓదేలు, కార్తికేయ, అశ్విని అరోరా, సంపత్, భరత్, తిరుపతి, కిరణ్, నవీన్, అంజి, రాము, సిసింద్రీ, భగత్, మల్లయ్య, వంశి రామయ్య, రాజ్ కుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img