హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్(దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించినట్లు ‘దోస్త్’ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. మొదటి విడతలో 1,41,340 మందికి డిగ్రీ సీట్లు కేటాయించామని లింబాద్రి వెల్లడించారు. మొత్తం1,71,275 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,53,323 మంది విద్యార్థులు ఆప్షన్స్ను ఎంచుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 2,66,050 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు… ఈ నెల 26 వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన సూచించారు. రెండో విడత రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం(నేటి) నుంచి మొదలైందని లింబాద్రి చెప్పారు.