హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో 196 జతల ప్రత్యేక ట్రైన్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే నుంచి 42 ప్రత్యేక ట్రైన్లు రైళ్లు నడుస్తున్నాయన్నారు. ఈ నెల 20 – నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయన్నారు.
స్పెషల్ ట్రైన్లలో జనరల్ కేటగిరీ ఉండదని, రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని రాకేష్ వెల్లడించారు.
ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైందన్నారు.