Homeజిల్లా వార్తలుఎలక్షన్ లో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించాలి: ఏఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి

ఎలక్షన్ లో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించాలి: ఏఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి

ఇదేనిజం, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేసిన మున్సిపల్ కార్మికులకు డబ్బులు వెంటనే ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి సోమవారం ప్రభుత్వనికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఐదు నెలల నుండి ఎలక్షన్లో పనిచేసి బిఎల్ ఓ లకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం చాలా దారుణం అన్నారు. నెలలు గాడుస్తున్న డబ్బులు ఇవ్వకపోవడం ఏంటని ఆయన అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్మికులకు బిఎల్ఓ లకు సంబంధించిన డబ్బులు వాళ్లకు అందించాలన్నారు.

Recent

- Advertisment -spot_img