తెలుగు చిత్ర, సంగీత ప్రియులకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ప్రత్యేకంగా తెలియనక్కర్లే. తెలుగులో ఎన్నో గుర్తుండిపోయే పాటలకు సిరివెన్నెల రచనలు ప్రాణం పోసాయి. ఇక కరోనా సమయంలోనూ చాలా మంది తెలుగు సెలబ్రెటీలకు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ సందర్బంగా రాజా తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేస్తూ 2020 లో గొప్ప ప్రయాణం మొదలుపెడుతున్నట్లు, నా కొత్త ప్రయాణానికి సంతోషిస్తున్నా అని పేర్కొన్నారు. ఇక రాజా కూడా నటునిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు బాగా పరిచయమే.