Homeహైదరాబాద్latest Newsప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి

మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం పీఏ పల్లి మండలం మేడారం గ్రామంలో గురువారం మేడారం జాతర సందర్భంగా లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెలుగురి వల్లపు రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోటకురి పరమేష్, మాజీ సర్పంచ్ కలుసాని అరుణప్రభాకర్ రెడ్డి, రంగా రెడ్డి, మాదా సుధాకర్ గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img