పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తయ్యబ్ అనే వ్యక్తి తన 15 రోజుల కన్న కూతురిని సజీవంగా పాతిపెట్టాడు. ఆ ఆడబిడ్డకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం, చికిత్సకు తన వద్ద డబ్బు లేకపోవడంతోనే ఇలా చేసినట్లు అతను చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేయగా విషయం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.