Homeహైదరాబాద్latest NewsSHOCKING: ప్రముఖ యూట్యూబర్ మృతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

SHOCKING: ప్రముఖ యూట్యూబర్ మృతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

యూట్యూబర్స్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోవడంలేదు. తమ కంటెంట్ తో ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, కోపం తెప్పించి.. ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు ఎంతో ఫేమస్. అలా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ సినీ రివ్యూయర్ అబ్రదీప్ సహా. సినిమా రివ్యూలను ఎంతో కోపంతో ఊగిపోతూ చెప్తూ బిగా ఫేమస్ అయ్యాడు. అతనిని అందరూ యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ అని పిలుస్తారు.

తాజాగా ఆయన అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఆయన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కొంతమంది సహాయం చేయాలని కూడా ఆయన స్నేహితులు సన్నిహితులు కోరారు. అయితే తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అతని వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు మాత్రమే.

ఈ మేరకు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ ప్రకారం.. సాహా మంగళవారం రాత్రి మరణించినట్లు పేర్కొన్నారు. ‘బరువైన హృదయంతో.. నేను అబ్రదీప్ సాహా లేదా యాంగ్రీ రాంట్‌మాన్ ఇక లేడని చెప్పాలి. మీ అందరికీ తెలిసిన అతను గతరాత్రి మరణించాడు. ప్రస్తుతానికి మాటలు రావట్లేదు. అతను అందరి ముఖాల్లోకి తీసుకురాగలిగిన ఆనందపు జ్ఞాపకాలు మిస్ అవుతాము’ అంటూ రాసుకొచ్చాడు. మరొకరు ‘అతని స్కూల్ క్లాస్‌మేట్ నుంచి నాకు సమాచారం అందింది. ఆయన నిజంగానే చనిపోయారు. మేము 10వ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నాం’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Recent

- Advertisment -spot_img