Homeహైదరాబాద్latest Newsరైతుల సొమ్ము రూ. 3.72 కోట్లు స్వాహా

రైతుల సొమ్ము రూ. 3.72 కోట్లు స్వాహా

రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పంట నష్టం పరిహారాన్ని దారి మళ్లించారు ఓ ప్రబుద్దుడు. కృష్ణా జిల్లా పెడనలో రైతులను కంప్యూటర్ ఆపరేటర్ నట్టేట ముంచేశారు. సింగరాయపాలెంకు చెందిన నాగమల్లేశ్వరరావు ఏవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ. 3.72 కోట్లను నకిలీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని కొట్టేశాడు. ఈ విషయం రైతులకు తెలియడంతో ఏవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ స్కాం వెనుక పలువురు వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏవో శ్రీనివాస్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్‌తో మరికొంతమంది నాయకులు ఉన్నట్లు అటు రైతులు సైతం ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img