Homeజిల్లా వార్తలునీటి కోసం రైతన్న ఎదురుచూపు

నీటి కోసం రైతన్న ఎదురుచూపు

ఇదేనిజం, నల్లబెల్లి: మండలంలోని రైతులు యాసంగి పంటకు నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మండలానికి ఎస్సారెస్సీ కెనాల్ నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ బోల్లోనిపల్లె నుంచి నందిగామ వరకు చాలా వరకు పూడిపోయి ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాలువ మరమ్మత్తులు చేయాలని అధికారులకు చెప్పిన మరమ్మత్తులు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ మరమ్మత్తులు చేసి నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img