రాజస్థాన్లోని షాహ్పురా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జైపూర్-ఢిల్లీ హైవేపై ట్రక్కును ఓవర్టేక్ చేసేందుకు బస్సు యత్నించింది. ఆ సమయంలో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఢిల్లీకి చెందిన విజయ్ అగర్వాల్ (40), ఆయన భార్య టీనా అగర్వాల్ (36), వారి కుమారుడు ప్రీతమ్ (16) చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.