Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై బొలెరో, థార్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.వేగంగా వస్తున్న బొలెరో, థార్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొని పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులు బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. థార్ వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img