ఇదేనిజం, శేరిలింగంపల్లి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయదుర్గం వాసి సుబ్బారావు (38) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతుడు టీవీఎస్ ఎక్సెల్ పై టిఫిన్స్ అమ్మే వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.