బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెగుసరాయ్ పట్టణంలోని రతన్ చౌక్ సమీపంలో కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులు ముగ్గురిని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.