Hyderabad : కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ యజమాని ఏర్నేని నవీన్పై కేసు నమోదైంది. చెన్నుపాటి వేణు ఫిర్యాదు మేరకు రాధాకిషన్తో సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నిర్మాత ఏర్నేని నవీన్ పేరును ఎఫ్ఐఆర్లో జూబ్లీహిల్స్ పోలీసులు చేర్చారు. గతంలో క్రియా హెల్త్కేర్ను చెన్నుపాటి వేణు ప్రారంభించారు. క్రియా హెల్త్కేర్లో మైత్రిమూవీస్ యజమాని నవీన్ డైరెక్టర్గా ఉన్నారు. క్రియా హెల్త్కేర్లోని డైరెక్టర్లు తనను కిడ్నాప్ చేయించారని వేణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.