Homeహైదరాబాద్latest Newsప్రమాదావశాత్తు గడ్డికట్టలు దగ్ధం

ప్రమాదావశాత్తు గడ్డికట్టలు దగ్ధం

ఇదే నిజం, రాయికల్: రాయికల్ మండలం సింగరావుపేట గ్రామంలో బర్కం మధుకి చెందిన బర్ల ఫారం దగ్గర ఆదివారం రోజున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 800 వరకు గడ్డి కట్టలు కాలి బుడిద అయ్యాయి. సుమారు రూ. 45,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని యాజమాని తెలిపారు . అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేసారు. ఆలోగా గడ్డి కట్టలు పూర్తిగా కాలిపోయాయి. వెంటనే స్థానిక తహశీల్దార్ మరియు ఇతర సంబంధిత అధికారులకు సమాచరం అందించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img