Homeక్రైంసిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్‌ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ వద్ద ఉన్నట్టుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్‌ రైలును యాదాద్రి భువనగరి జిల్లాలోని బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. రైలు ఇంజిన్‌ బ్రేక్‌ లైనర్లు బలంగా పట్టేయడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించారు. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. 20 నిమిషాల తర్వాత రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.

Recent

- Advertisment -spot_img