Homeక్రైంకారులో మంటలు.. 8 మంది సజీవ దహనం

కారులో మంటలు.. 8 మంది సజీవ దహనం

– ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమయంలో కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు బరేలీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img