Homeజిల్లా వార్తలుప్రాణం ఉన్నంత వరకు ప్రజల వెంటే: ఆరూరి రమేష్

ప్రాణం ఉన్నంత వరకు ప్రజల వెంటే: ఆరూరి రమేష్

ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: ప్రాణం ఉన్నంత వరకు ప్రజల వెంటే ఉంటానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మంగళవారం పర్వతగిరి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి పార్టీ నాయకులను, కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుమార్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్, ఎంపిపి కమల – పంతులు, పాక్స్ చైర్మన్ మనోజ్, దేవేందర్, వైస్ ఎంపిపి రాజేశ్వర రావు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మండల రైతుబందు కో ఆర్డినేటర్ శ్రీను, మాజీ మార్కేట్ డైరక్టర్ ఏకాంతం గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాములు, సీనియర్ నాయకులు భాస్కర్ రావు, వెంకటేశ్వర రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img