Homeహైదరాబాద్latest Newsఓవైసీల కోటలో తొలిసారి అలజడి.. అసదుద్దీన్ కౌంటర్​కు నవీనీత్​ కౌర్ ఎన్​కౌంటర్

ఓవైసీల కోటలో తొలిసారి అలజడి.. అసదుద్దీన్ కౌంటర్​కు నవీనీత్​ కౌర్ ఎన్​కౌంటర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఓవైసీల కోటలో తొలిసారి అలజడి నెలకొంది. ఓ పక్క పాతబస్తీలోని సమస్యలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మజ్లిస్ పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తుండగా.. తాజాగా ఆమెకు మద్దతుగా వచ్చిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఫైర్ బ్రాండ్ ఎంపీ నవనీత్​ కౌర్ సైతం ఓవైసీ​ బ్రదర్స్​కు చెమటలు పట్టిస్తున్నారు. 12 ఏండ్ల కిందట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల హైదరాబాద్​కు వచ్చిన నవనీత్ కౌర్ కౌంటర్ ​ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘15 నిమిషాల చాలు’ అన్న అకర్బుద్దీన్ వ్యాఖ్యలకు ‘మాకు 15 సెకన్లు చాలు’అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. దమ్ముంటే హైదరాబాద్​కి రావాలని.. తేల్చుకుందామని నవనీత్ కౌర్​కు సవాల్ విసిరారు. ‘హైదరాబాద్​కు వస్తా.. నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా’అంటూ నవనీత్​ కౌర్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. లోక్​సభ ఎన్నికల వేళ ఇద్దరు కాషాయ వనితలు.. ఓవైసీ బ్రదర్స్​కు వరుస చాలెంజ్​లు విసురుతున్నారు. దీంతో హైదరాబాద్ ఎంపీ స్థానంలో గెలుపు మజ్లిస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Recent

- Advertisment -spot_img