– పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల్లో మాత్రమే
– మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు వర్తింపు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం వర్తించనున్నది. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.