Homeజిల్లా వార్తలుబాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఇదేనిజం, దేవరకొండ: మండలంలోని డిండి గ్రామానికి చెందిన కటికర్ల సవారి అనారోగ్యంతో మృతిచెందారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శుక్రవారం డిండి గ్రామంలో సవారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సవారి మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మాధవరం సునీతజనార్ధన్ రావు, సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు గిరామోని శ్రీను, మేకల కాషన్న, మాధవరం జనార్దన్ రావు, తదితరులున్నారు.

Recent

- Advertisment -spot_img