Homeహైదరాబాద్latest Newsఅభివృద్ది పనులకు శంకుస్థాపన

అభివృద్ది పనులకు శంకుస్థాపన

ఇదేనిజం, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి గాయత్రినగర్ ఫేస్-2లో రూ.36 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించతలపెట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహరెడ్డి, ఝాన్సీ, గాయత్రినగర్ ఫేస్-2 అధ్యక్షులు మహేందర్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ కళ అచ్యుతవర్ధన్, విజయ్ భాస్కర్‌రెడ్డి, శివరావు, రమేశ్, భూపాల్, కృష్ణమూర్తి, సంజీవ్‌రెడ్డి, శ్రీదేవి, శ్యామల, జార్జ్, సంధ్య, మహేష్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img