- పరారీలో అసలు నిందితుడు..
- అతడి కోసం గాలిస్తున్న ఢిల్లీ పోలీసులు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన హీరోయిన్ రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రముఖుల డీప్ఫేక్ వీడియోలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. రష్మిక వీడియో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఈ డీప్ఫేక్ వీడియోపై సినీ పరిశ్రమలన్నీ స్పందించాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.