హైదరాబాద్ః కేవలం రూ.12 లక్షలకే బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు ఇస్తానంటూ ఓ కేటుగాడు రూ.4 లక్షలతో ఉడాయించాడు.
మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
యూసఫ్ పేటకు చెందిన బుచ్చయ్యకు 30 తులాల బ్రిటిష్ కాలం నాటి బంగారం కేవలం రూ.12 లక్షలే ఇస్తానని రమేష్ నమ్మించాడు.
బంగారం అందించేందుకు అగ్రిమెంట్ చేసుకోన్నాడు. రూ. 4 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన పైసలను నెలకు రూ.లక్ష చొప్పున ఇచ్చేలా రమేష్ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బుచ్చయ్య.
అయితే రమేష్ ఇచ్చిన ఆ బంగారం నకిలీదని తేలడంతో షాక్కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థంకాక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.