తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా పాల్గొన్న సాక్షి అగర్వాల్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన పేరు మీద మనీ లాండరింగ్ జరుగుతోందని, ఎవరూ మోసపోవద్దని ఆమె తెలిపింది. సోషల్ మీడియాలో తన పేరును ఉపయోగించి కొంతమంది డబ్బు మోసానికి పాల్పడుతున్నారని సాక్షి అగర్వాల్ హెచ్చరించింది. సాక్షి అగర్వాల్ సినిమాలు రాజా రాణి, కాలా, విశ్వాసం, టెడ్డీ, సిండ్రెల్లా, మొదలైన సినిమాలో నటించింది.
ఇటీవల చాలామంది సెలబ్రిటీలు ఆన్లైన్ మోసంలో చిక్కుకున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మాణ సంస్థ పేరుతో, రాజ్కమల్ కంపెనీ పేరుతో పలు మోసాలు జరిగాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు నటి సాక్షి అగర్వాల్ కూడా ఈ స్కామ్పై అప్రమత్తమైంది. అన్నీ ఆన్లైన్లో ఉండటంతో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి.