Homeబిజినెస్‌Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Insurance : కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం-జేఏవై) మరింత మందికి అందించాలని నిర్ణయించింది.

ఈ ప్రోగ్రామ్‌లో మరో రెండు కోట్ల మందిని భాగం చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కుటుంబాలకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల బీమా(health insurance)ను అందజేయనుంది.

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం-జేఏవై)(insurance policy) మరింత మందికి అందించాలని నిర్ణయించింది.

ఈ ప్రోగ్రామ్‌లో మరో రెండు కోట్ల మందిని భాగం చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇప్పటికే పేదలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన ప్రజలకు చెందిన 10.76 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా(Life Insurance)ను ప్రభుత్వం కల్పిస్తోంది.

ఈ కుటుంబాలకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల బీమాను అందజేస్తోంది.

సోషియో ఎకనమిక్, కాస్ట్ సెన్సస్(ఎస్ఈసీసీ) డేటాబేస్, ఇతర డేటాబేస్‌ల నుంచి ఈ నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్ఏ) స్కీమ్ కోసం లబ్దిదారులను కేంద్రప్రభుత్వం గుర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఈ ప్రోగ్రామ్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ అమలు చేస్తోంది.

ఇప్పటి వరకు ఎస్ఈసీసీ డేటాను ఆధారంగా చేసుకుని మాత్రమే లబ్దిదారులను ఈ అథారిటీ గుర్తించేది.

కానీ ప్రస్తుతం ఇతర డేటాబేస్‌లను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటోంది.

అంటే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన వంటి సర్వీసుల డేటా బేస్‌లను కూడా ఈ అథారిటీ వాడుకుని లబ్దిదారులను గుర్తించనుంది.

దీంతో మరింత మంది ఈ స్కీమ్‌ నుంచి ప్రయోజనం పొందనున్నారు.

కొన్నిసార్లు డేటా బేస్‌లో లేని కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ అవసరం ఎంతో ఉంటోంది.

వీరికి ఈ సౌకర్యం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం ఇతర డేటా బేస్‌ల డేటా కూడా తీసుకోవాలని నిర్ణయించింది.

కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన..

ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్ 14న లాంచ్ చేసింది.

10.76 కోట్ల కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తోంది.

ఆయుష్మాన్ భారత్ కిందకు మరో రెండు కోట్ల కుటుంబాలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని, దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెప్పారు.

Recent

- Advertisment -spot_img