ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల పావని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని రైతు సంఘం భవనం వద్ద ఉచిత వైద్య శిబిరం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున క్యాంపులో పాల్గొని వారికి సంబంధించినటువంటి సమస్యలను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. వారి స్టాప్ అందరు కూడా గ్రామ ప్రజలకు మంచిగా సహకరించి సలహాలు ఇవ్వడం జరిగింది. పావని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట రమేష్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.