– విద్యార్థులకు రిటైర్డ్ ఐపీఎస్ మురళి సూచన
– నాగర్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు
ఇదే నిజం, నాగార్జునసాగర్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని రిటైర్డ్ ఐపీఎస్ మురళి పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జున సాగర్హిల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో1964-1974 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు స్వర్ణోత్సం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ మురళి పాల్గొని ఆనాటి ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనందరం ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ లో చక్కటి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ, విదేశాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంజుల రామదాసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాములు , ప్రసాద్ విజయ్ కుమారు, విజయ్ కుమార్, శ్యామ్ , రఘునంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు