– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి
ఇదేనిజం, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ గురించి అలాగే విద్యార్థుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు