Homeహైదరాబాద్latest Newsగంజాయి మిల్క్ షేక్..పిల్లలు జాగ్రత్త

గంజాయి మిల్క్ షేక్..పిల్లలు జాగ్రత్త

గంజాయి వ్యాపారం కోసం కేటుగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. హ్యాష్ ఆయిల్, చాక్లెట్లుగా మార్చి అమ్మే విధానం పోయి ఇప్పుడు పౌడర్ ద్వారా మిల్క్‌షేక్‌గా రూపాంతరం చెందిస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా దుకాణంలో గంజాయి పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పౌడర్‌ను పాలల్లో కలిపి మిల్క్‌షేక్‌గా తాగుతారట. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. తల్లిదండ్రులు పిల్లల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

Recent

- Advertisment -spot_img