విరాట్ కోహ్లీ ఆటతీరుపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లి ఆటతీరుపై గవాస్కర్ స్పందిస్తూ.. తన స్థాయికి తగ్గట్టుగా ఆడడంలో కోహ్లీ విఫలమవుతున్నాడని ఆనాడు. కోహ్లి అర్ధ సెంచరీ విలువైనదే అయినప్పటికీ అతని ఇన్నింగ్స్ లో చాలా సేపు బౌండరీలు లేకుండా సాగిందని అన్నాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి ఆడిన విరాట్ కోహ్లీ 15వ ఓవర్లో ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 118 మాత్రమే అని అన్నారు. అయితే ఇలాంటి స్టార్ ప్లేయర్ నుంచి జట్టుకు ఇలాంటివి కావాలి అని తాను అనుకోవడం లేదని గావస్కర్ అన్నాడు.