హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మేయర్ చేస్తే.. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
టీఆర్ ఎస్ పాలనలో ప్రజల ఆస్తులకు భరోసా లేదన్నారు. ఒక జాతీయ పార్టీ లేఖనే ఫోర్జరీ చేశారంటే… ఇక ప్రజల ఆస్తులకు భరోసా ఏంటని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ నిజంగా హిందువైతే.. నకిలీ లేఖపై ప్రమాణం చేయడానికి రేపు 12 గంటలకు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రావాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ దేశ ద్రోహి.. ఆయనకి ఇంగితజ్ఞానం లేదు. భాగ్యనగరం దేశభక్తుల అడ్డా. ఆలేరులో దేశద్రోహి వికారుద్దీన్ని కేంద్ర బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. విమర్శలు ప్రజాస్వామ్య బద్దంగా చేయాలని’ సంజయ్ అన్నారు.
పీఎం మోడీని విమర్శించే అర్హత కేసీఆర్కు లేదన్నారు. సీఎం కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుందని సంజయ్ పేర్కొన్నారు
కేసీఆర్ ఎంఐఎంకి వత్తాసు పలుకుతున్నారని, రేపటి నుంచి కేసీఆర్ చరిత్ర బయటపెడతామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాలు విసిరారు.
6 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని, టీఆర్ఎస్ గత ఎన్నికల మ్యానిఫెస్టో వెబ్సైట్లో లేకుండా చేసినా.. మా దగ్గర ఉందన్నారు.
‘బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసింది. రామ మందిర నిర్మాణం చేపట్టింది. సీఏఏ అమలు చేశాం. ముస్లిం మహిళలను కాపాడటానికి ట్రిపుల్ తాలక్ని రద్దు చేశాం. హరితహారం, రైతు వేదికకు కేంద్రమే నిధులు ఇచ్చింది’ అన్నారు సంజయ్.