Homeజిల్లా వార్తలుగోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..!

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..!

  • భద్రాచలం వద్ద 46.00 అడుగులు నీటిమట్టం కొనసాగుతుంది.

ఇదే నిజం, కుకునూరు: మంగళవారం, ఏజెన్సీ కుకునూరు,వేలేరుపాడు మండలాలలో ఇటీవల భారీ వర్షాలకు గోదావరిలో భారీగా వరద చేరి కుకునూరు గుండేటి వాగుకు, వేలేరుపాడు ఎద్దు వాగుకు, వరద పోటెత్తి ఎత్త గాపలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముప్పు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా వరదలు తగ్గుముఖం పట్టడంతో ముంపు మండలాల ప్రజల ఊపిరి పీల్చుకున్నారు. కాగా మంగళవారం మళ్లీ ఎగువ భద్రాచలం వద్ద గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో గోదావరి లో 46. అడుగులు నీటిమట్టం కొనసాగుతోంది. కాగా కుకునూరు వేలేరుపాడు మండలాల్లో మరోసారి వరద భయం పట్టుకుంది. గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

Recent

- Advertisment -spot_img