Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎంపి అభ్యర్థి వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంకట స్వామి మనుమడు వివేక్ కొడుకు గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఒక ప్రజా కుటుంబం నుండి వచ్చిన యువకుడు, పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజానీకానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుందని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలలోపే 6 గ్యారెంటీ లలో 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, ఈప్రాంత నీటి సమస్య గురించి ముఖ్యమంత్రి ని దాదాపు 12 సార్లు నేరుగా కలవడం జరిగిందని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నడైనా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి ఈ ప్రాంత సమస్యల గురించి కనీసం వివరించారా అని, వడ్ల కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం ఉన్న వారికి అండగా మేము ఉంటామని,వంశీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కలిసి కట్టుగా పనిచేయాలని, ఈ ప్రాంత సాగు,త్రాగు నీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మాజీ గ్రంధాలయ చైర్మన్ జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు,మాజీ సర్పంచ్ భీమ సంతోష్,సీనియర్ నాయకులు తాండ్ర సురేందర్,రాపల్లి గంగన్న,మాజీ సర్పంచ్లు రేవల్ల సత్యనారాయణ గౌడ్,చిర్ర గంగాధర్,చెవుల వెంకటేశం,నాయకులు మాజీ వార్డు సభ్యులు గురిజాల బుచ్చిరెడ్డి,పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్,కిష్టంపేట రమేష్ రెడ్డి,తిరుపతి, ప్రవీణ్ విజేయ్,వినోద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img