ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రైతుభరోసాపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేలు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అయితే మూడు విడతల్లో ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించిన తరువాత విధి విధానాలను ఖరారు చేయనుంది.