ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీని ద్వారా ఉద్యోగులు పెద్ద మొత్తంలో ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఏకీకృత పెన్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం (NPS) కింద ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపికను అందించింది. ఈ విషయంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS కింద UPS ఎంపికను ఎంచుకోవచ్చు లేదా UPS ఎంపిక లేకుండా NPSతో కొనసాగవచ్చు.
ALSO READ: Ration Card: కొత్త పెళ్లైన జంటలు రేషన్ కార్డులు పొందాలంటే.. ఇలా అప్లై చేసుకోండి..!