Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు శుభవార్త.. నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం..!

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఎలక్షన్​ కోడ్​ నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇన్​చార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వెల్లడించారు. లోక్​సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్​లో ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్​గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరించున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img