HomeSocial Media‘ఫోన్‌లో కాదు.. దమ్ముంటే నేరుగా రండి’ ఫోన్ నంబర్స్ ఇవ్వే..

‘ఫోన్‌లో కాదు.. దమ్ముంటే నేరుగా రండి’ ఫోన్ నంబర్స్ ఇవ్వే..

– గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
– అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట
– శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని రాజాసింగ్​కు బెదిరింపులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు.‘ఫోన్‌లో కాదు దమ్ముంటే నేరుగా రావాలని’సవాళ్లు విసిరారు. 7199942827, 4223532270 నంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

అయ్యోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం రాజాసింగ్ డీజీపీ అంజనీకుమార్‌ (అప్పటి డీజీపీ)కు లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి ఫోన్​ కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్​ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img