Homeహైదరాబాద్latest Newsపదవ తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసిన ప్రభుత్వ విప్

పదవ తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసిన ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం లోని అన్ని స్కూళ్లలో పదవ తరగతిలో 10 జీపీఏ వచ్చినటువంటి విద్యార్థులకు 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు.పద్మ రవీందర్ ఆధ్వర్యంలో పదిమంది విద్యార్థినులకు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క సన్మానం ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క విద్యార్థినిలు ఆంగ్లో వేదిక్ స్కూల్ కు సంబంధించినటువంటి ఆరుగురు విద్యార్థులు మరియు చైతన్య భారతి స్కూల్ కు చెందినటువంటి ఒక విద్యార్థిని మరియు గ్లోబల్ స్కూల్ కు చెందినటువంటి విద్యార్థిని ఒకరు అదే విధంగా ప్రభుత్వ బాలికల స్కూల్ కు చెందినటువంటి ఇద్దరు విద్యార్తినులకు ఘనంగా సన్మానం చేయడమైనది ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ బుగ్గారం, జెడ్పిటిసి బాదినేని రాజేందర్ వెలగటూరు మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి సన్మానిత పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆంగ్ల విధి స్కూల్ సిబ్బంది స్టాఫ్ తోట శంకర్ జి శ్రీనివాస్ కార్యక్రమంలో భాగ స్వాములు అయినారు.

Recent

- Advertisment -spot_img