Idenijam, Webdesk : ఇటీవల తాగునీటి సరఫరాకు బెంగళూరులో ఏర్పడ్డ ఇక్కట్ల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా కోసం ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. 33 జిల్లాలకు గాను 10 మంది ఐఏఎస్లను కేటాయించింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.