ఇదే నిజం కోహెడ: కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో సిద్ధప్ప వరకవి 121వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సిద్ధప్ప ఆశ్రమంలో ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు శిష్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిద్ధప్ప రాసిన గ్రంథాల్లోని పద్యాలు పాటలు చదువుతూ భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కుమారుడు మాణిక్యలింగం, కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, శిష్యులు తదితరులు పాల్గొన్నారు.