Homeహైదరాబాద్latest Newsధర్మపురిలో ఘనంగా వనమహోత్సవం

ధర్మపురిలో ఘనంగా వనమహోత్సవం

ఇదే నిజం, ధర్మపురి రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ధర్మపురి మండలం తుమ్మేనాల గ్రామంలో సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొనీ మొక్కలు నాటారు. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను అలాగే వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,అధికారులు కూడా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img