Homeజిల్లా వార్తలుఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాలు…

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాలు…

ఇదేనిజం ధర్మారం: ధర్మారం మండలం శాయంపేట గ్రామం లో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్యదైవంమైన పెద్దమ్మతల్లి బోనాలు, పట్నలను ఆదివారం ఘనంగా నిర్వచించారు. ఈ సందర్భంగా మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పులు, శివసతుల పునకల మధ్య గ్రామ విధుల గుండ ఆలయాన్ని కి చేరుకొని పట్నాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులసంఘం అధ్యక్షుడు బొడిగే నర్సయ్య పెద్దమ్మ తల్లి ఆశీసుల్లతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. తాజా మాజీ సర్పంచ్ చేనెల్లి సాయికుమార్ పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షులు కుష శేఖర్ ,బోడిగే సత్తయ్య , బొడిగె మొండ్య,డబ్బట్టి సంతోష్,అధిక సంఖ్యలో మహిళలు,గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img