ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: గృహజ్యోతి, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాల అమలుకు సబంధించి మేడారం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ మేడారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న సాయంత్రం .. గృహజ్యోతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలను అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ రెండు పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని, సమ్మక్క, సారలమ్మ జాతరను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండగగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కుంభమేళాను జాతీయ పండగగా గుర్తించినప్పుడు మేడారం జాతరను ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే కేంద్ర పెద్దలతో మాట్లాడి మేడారం జాతకు నిధులు వచ్చేలా చూడాలని కోరారు.