Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్​లో చేరిన గుత్తా కుమారుడు అమిత్​రెడ్డి

కాంగ్రెస్​లో చేరిన గుత్తా కుమారుడు అమిత్​రెడ్డి

– ఎన్నికల వేళ.. బీఆర్ఎస్​కు మరో షాక్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: లోక్​సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్​కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో అమిత్​ రెడ్డికి కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్​ రెడ్డి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img