Homeహైదరాబాద్latest Newsప్రచారంలో పాల్గొన్న హన్మంతరెడ్డి

ప్రచారంలో పాల్గొన్న హన్మంతరెడ్డి

ఇదే నిజం, కుత్బుల్లాపూర్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి131 డివిజన్‌లో పర్యటించారు. డివిజన్‌లోని సూర్యానగర్, రాంరెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, రాధాకృష్ణ, దుర్గారావు, నర్సింహా రెడ్డి, పెంటయ్య, వెంకటేష్ యాదవ్, లింగం, వెంకటేష్, అశోక్, సుజాత, హైమావతి రెడ్డి, అశ్విని, భవాని తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img