ఇదే నిజం ముస్తాబాద్: అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు…వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్నారు వైద్యులు. అలాంటి వైద్యుల దినోత్సవాన్ని ముస్తాబాద్ తిరుమల నర్సింగ్ హోం, పీపుల్స్ హాస్పిటల్ లో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోం, పీపుల్స్ దవాఖాన లో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకోని వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బగా పీపుల్స్ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, రాజారాం అలాగే డాక్టర్ అర్చన డాక్టర్ అశ్విన్ కుమార్ లు కేక్ కట్ చేయగా వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సిబ్బంది మరియు అభిమానులు. తిరుమల నర్సింగ్ హోంలో స్త్రీ వైద్య నిపునులు స్రవంతి కేక్ కట్ చేయగా… సిబ్బంది కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ… గత 32 సంవత్సరాలుగా ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఓక్కరి వైద్య సేవలందిస్తుంది తిరుమల నర్సింగ్ హోం అని పేర్కోన్నారు. అలాగే ప్రతి బుధవారం ఉచితంగా వైద్య సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రముఖ వైద్యులు ఎరవెల్లి అనురాధ-చంద్రశేఖర్ రావు సహకారాలతో గుండె సంబందిత వైద్య పరిక్షలను సైతం నిరుపేదలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల కోసం తిరుమల నర్సింగ్ హోం అందిస్తున్న సేవలను మండల ప్రజలతో పాటు పరిసరప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు స్రవంతి కోరారు. వైద్యుల దినొత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రామ్. డాక్టర్ అర్చన. డాక్టర్ అశ్విన్ కుమార్. భిక్షపతి, భాస్కర్, సుమాంజలి, రేక, శిరిష, కల్పన, రాజేశ్వరి, అశోక్, నవీన్, బాబు, భాస్కర్, వెంకటేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.